“అకారణంగా సీతను అడవికి పంపిన రాముడిని నేను
ఆరాధించను..” – జెఠ్మలాని!
"నీలాంటి
వాళ్ళు ఆరాధించకపోతే ఏంటట నష్టం?"
జెఠ్మలానిలాంటి వాళ్ళు తమ స్వార్ధంకోసం
చేసే రాద్ధాంతాల వలన ధర్మానికి అధర్మం అనే ఎంగిలి అంటుకోదు. ధర్మదేవత కోటు
వేసుకుని నోట్లకోసం అవినీతి అధినేతల తరపున వకాల్తా పుచ్చుకుని వాదించే ఇలాంటి
వారికి నిజమైన ‘ధర్మకోణం’ ఎప్పటికీ రుచించదు, అసలు కనిపించదు కూడా.
అసలు ఈయన్ని రాముని గురించి నమ్మమని, ఆరాధించమని ఇప్పుడు
ఎవరు బలవంతం చేసారు. ఈయనకి ప్రపంచంలో ఉన్న అధ్యాత్మిక పురుషులందరు పైన నమ్మకం ఉండి
ఒక్క రాముని పైనే నమ్మకంలేదా? అలా అయితే
ఆయన అభిప్రాయాన్ని ఆయన వద్దే ఉంచుకోవాలి.ఇలా మరొకరి మనోభావాలపై బురదచల్లి తన దురద
తీర్చుకోవడం ఎందుకు. ఈ విశాల భారతావనిలో ఎవరికివారు
తమకు నచ్చిన ధర్మాన్ని ఆరాధిస్తూ సామాజిక జీవనం సాగిస్తున్నారు. అంతమాత్రాన ఎవరికి
వారు ఇలా నోరుపారేసుకుంటే ఎలా ఉంటుందో ఈ మేధావికి తెలియని విషయం అనుకోవాల? ఇలాంటి
వ్యాఖ్యలే మరెవరిమీదైనా చేసుంటే ఈపాటికి ఈయన
పరిస్తితి ఎలా ఉండేదో జెఠ్మలానికి బాగా తెలుసు. అందుకే అటువైపు కన్నెత్తి చూడటానికి
కూడా ఇలాంటి వాళ్ళు భయపడతారు.
పురవీధిలో దేవుని పల్లకి బయల్దేరుతుంటే మంగళవాయిద్యాలు
ఒక్కసారిగా మోగుతాయి. అదివిన్న జనానికి భక్తిభావం ఉప్పొంగుతుంది. అదే సమయంలో ఆ
వీధిలో ఉండే కుక్కలు ఉలిక్కిపడి మొరగడం ప్రారంభిస్తాయి. అంతమాత్రాన వాటి పరపతి
పెరగదు, స్వామివారి పరపతి తగ్గదు.
No comments:
Post a Comment